- వర్సిటీ చరిత్రలోనే తొలిసారి ఆదివాసీ మహిళ నియామకం
ఓయూ,వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు. బషీర్బాగ్లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్గా ఆమెను నియమిస్తూ వీసీ ప్రొ. రవీందర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ చరిత్రలోనే ఆదివాసీ మహిళా ప్రొఫెసర్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టడం తొలిసారి. యూనివర్సిటీలోనే పీజీ, లా కోర్సులు చదివిన ఆమె ఓయూ లా విభాగంలో అసిస్టెంట్ప్రొఫెసర్గా జాయిన్అయ్యారు. ఆదివాసీ కమ్యూనిటీలోని కోయ తెగకు చెందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురైన అనురాధ ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామమైన టేకులగూడెంలో జన్మించారు.