ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్.. సర్వీస్ గన్‌తో కాల్చుకొని సూసైడ్

ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్..  సర్వీస్ గన్‌తో కాల్చుకొని సూసైడ్

ఛత్తీస్‌గఢ్‌ లోక్ సభ ఎన్నికల్లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలోని మహాసముంద్ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నయి. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  అతను ఎందకు సూసైడ్ చేసుకున్నాడని విషయం ఇంకా తెలియలేదు. ఉన్నత అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని కాంకేర్, మహాసముంద్, రాజ్‌నంద్‌గావ్‌తో సహా మూడు నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది.