- సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాల్పుల కలకలం
- కారు డ్రైవర్ పై కాల్పులు.. రూ.48 లక్షలతో పరారీ
సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాల్పుల కలకలం చెలరేగింది. ఓ దుండగుడు గన్ ఫైర్ చేయడంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చేర్యాలకు చెందిన నర్సయ్య అనే రియల్టర్ డ్రైవర్ కాలుపై గన్తో కాల్చి .. కారులో ఉన్న 48లక్షల 50 వేలను దుండగులు ఎత్తుకెళ్లారు. నంబర్ లేని బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కారు అద్దాలు పగలగొట్టి డబ్బును ఎత్తుకెళ్లారు. సిద్దిపేటలోని ఓ ప్లాట్ విక్రయానికి నర్సయ్య, ఆయన డ్రైవర్ పర్శరాములు కారులో వచ్చారు. విక్రయ డబ్బులు 43 లక్షలు కొనుగోలు దారు నుంచి తీసుకొని డ్రైవర్కు ఇచ్చి కారులో పెట్టాడు. సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి వెళ్లాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ తొడపై గన్తో కాల్చాడు. మరో వ్యక్తి కారు డోర్లు తీసి రూ.43 లక్షల నగదు తీసుకుని పారిపోయారు. కాగా.. నిందితులు గన్ను కారులోనే వదిలి పారిపోయారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ
దొందూ దొందే.. ఇద్దరూ దొంగలే
హీరోయిన్స్ అంటే గ్లామర్ డాల్స్ కాదు
దిశ ఎన్ కౌంటర్ కేసు.. సుప్రీంకు కమిషన్ నివేదిక