గురుకుల ఎగ్జామ్ ​ఫస్ట్ డే 86.5 శాతం హాజరు

గురుకుల ఎగ్జామ్ ​ఫస్ట్ డే 86.5 శాతం హాజరు

హైదరాబాద్, వెలుగు: గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్షకు 86.54 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఈమేరకు తెలంగాణ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్స్​ రిక్రూట్​మెంట్​ బోర్డు (ట్రిబ్​) కన్వీనర్​ డాక్టర్​ మల్లయ్య భట్టు ప్రకటించారు. తొలిసారి ఆన్​లైన్​లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు మొదటి రోజు 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 9,450 మంది హాజరయ్యారని చెప్పారు.  మొదటి సెషన్​లో 4,368 మంది, రెండో సెషన్​లో 4,720 మంది, మూడో సెషన్​లో 362 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని చెప్పారు.  పరీక్ష తేదీలను తెలుసుకుని వారం రోజుల ముందే హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవాలని, అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.