ప్రతీ టికెట్ పై రూ.5 అయోధ్య రాముడికి.. హనుమాన్ టీమ్ కీలక ప్రకటన

ప్రతీ టికెట్ పై రూ.5 అయోధ్య రాముడికి.. హనుమాన్ టీమ్ కీలక ప్రకటన

హనుమాన్(HanuMan) మూవీ టీమ్ కీలక ప్రకటన చేశారు. తమ సినిమా ప్రతీ టికెట్ పైన రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రాకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth varma) తెరకెక్కిస్తుండగా.. యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే తగ్గట్టుగానే ట్రైలర్ కూడా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లోకి రానుంది. 

తాజాగా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన హనుమాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో హనుమాన్ ను మించిన సూపర్ హీరో లేరు. ఇదే మాట నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా అనిపించి వెంటనే ప్రశాంత్ వర్మ గురించి తెలుసుకున్నాను. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. 

ఈ సందర్బంగా హనుమాన్ మూవీ టీమ్ కీలక ప్రకటన చేశారు. హనుమాన్ సినిమా ప్రతీ టికెట్ పైన రూ.5 అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నెటిజన్స్ నుండి హనుమాన్ టీమ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.