
కివీస్తో టీ20లకు కెప్టెన్గా హార్దిక్, ధవన్కు వన్డే పగ్గాలు
- యంగ్ పేసర్లు కుల్దీప్ సేన్, యష్ దయాల్కు పిలుపు
- న్యూజిలాండ్, బంగ్లా టూర్లకు నాలుగు వేర్వేరు టీమ్స్ ఎంపిక
అడిలైడ్: ఇండియా క్రికెట్ టీమ్, రిజర్వ్ బెంచ్ ఎంత బలంగా ఉందో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ తొలిసారి ఏకకాలంలో నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. ముగ్గురికి కెప్టెన్సీ అప్పగించి.. ఇద్దరు యంగ్స్టర్స్ను తొలిసారి నేషనల్ టీమ్లోకి తీసుకుంది. టీ20 వరల్డ్కప్ అనంతరం న్యూజిలాండ్ (టీ20, వన్డే), బంగ్లాదేశ్ టూర్ల (వన్డే, టెస్టు)కు వెళ్లే ఇండియా టీమ్స్ను చేతన్ శర్మ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఫ్యూచర్ కెప్టెన్గా భావిస్తున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్లో కెప్టెన్సీ అప్పగించింది. వన్డేలకు ధవన్ సారథ్యం వహించనున్నాడు. న్యూజిలాండ్ టూర్లో భాగంగా ఇండియా ఈ నెల 18, 20, 22వ తేదీల్లో మూడు టీ20లు ఆడనుంది. ఇది వరకు ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కుర్రాళ్లతో కూడిన టీమ్ను నడిపించిన హార్దిక్ తొలిసారి ఓ మేజర్ టీమ్పై కెప్టెన్గా బరిలోకి దిగబోతున్నాడు. టీ20లతో పాటు ఈ నెల 25, 27, 30వ తేదీల్లో జరిగే మూడు వన్డేలకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
సీనియర్లకు రెస్ట్
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సీనియర్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, దినేశ్ కార్తీక్కు కివీస్ టూర్లో రెస్ట్ లభించింది. వీళ్ల గైర్హాజరీలో యంగ్స్టర్స్ ఇషాన్ కిషన్, గిల్, శాంసన్, ఉమ్రాన్లకు సత్తా చాటుకునే చాన్స్ లభించననుంది. ప్లేయర్లెవ్వరూ రెస్ట్ అడగకపోయినా.. పనిభారం, మెడికల్ టీమ్ రిపోర్టు దృష్ట్యా తామే ఇచ్చినట్టు చేతన్ శర్మ తెలిపాడు. ఇక, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం డిసెంబర్ 4 నుంచి జరిగే బంగ్లాదేశ్ టూర్లో రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్సీ అందుకుంటాడు. అతనితో పాటు కోహ్లీ, రాహుల్, షమీ తిరిగి వస్తారు. ఆసియా కప్లో గాయపడి ఆటకు దూరంగా ఉన్న స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లా టూర్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వన్డే, టెస్టు టీమ్లో ఉన్న అతను ఫిట్నెస్ సాధిస్తేనే అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇక, గాయం వల్ల వరల్డ్కప్కు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నాలుగు సిరీస్లకూ అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. బంగ్లాతో మూడు వన్డేలు డిసెంబర్ 4, 7, 10వ తేదీల్లో జరుగుతాయి. రెండు టెస్టులను అదే నెల 14–18, 22–26 మధ్య షెడ్యూల్ చేశారు.
వాళ్లకు తొలి చాన్స్
గత ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన యంగ్ పేసర్ కుల్దీప్ సేన్తో పాటు డొమెస్టిక్లో సత్తా చాటుతున్న యూపీ లెఫ్టార్మ్ పేసర్ యష్ దయాల్ తొలిసారి నేషనల్ టీమ్లోకి వచ్చారు. కివీస్తో వన్డేలకు కుల్దీప్ సేన్ ఎంపికవగా.. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో దయాల్ చోటు దక్కించుకున్నాడు. ఇక, తెలుగు ఆటగాడు, కీపర్ కేఎస్ భరత్ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. రిజర్వ్ కీపర్గా చాన్నాళ్లుగా జట్టుతోనే ఉంటున్న భరత్ ఇప్పటిదాకా డెబ్యూ చేయలేదు.
ఇండియా టీమ్స్
న్యూజిలాండ్తో టీ20లకు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్, కీపర్), గిల్, ఇషాన్ , దీపక్ హుడా, సూర్య కుమార్ , శ్రేయస్, సంజు శాంసన్ (కీపర్), సుందర్, చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్తో వన్డేలకు: ధవన్ (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్, కీపర్), గిల్, హుడా, సూర్య , శ్రేయస్, శాంసన్ (కీపర్), సుందర్, శార్దూల్, షాబాజ్, చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ , దీపక్ చహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్.
బంగ్లాదేశ్ వన్డేలకు: రోహిత్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), ధవన్, కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్, రాహుల్ త్రిపాఠి, పంత్ (కీపర్), ఇషాన్ (కీపర్), జడేజా, అక్షర్, సుందర్, శార్దూల్, షమీ, సిరాజ్, దీపక్ చహర్, యష్ దయాల్
బంగ్లాదేశ్ టెస్టులకు: రోహిత్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లీ, శ్రేయస్ , పంత్ (కీపర్), భరత్ (కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్, షమీ, సిరాజ్, ఉమేష్.