
మూడో టీ20లో విజయం సాధిస్తే బాగుండేందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. చివరి మ్యాచ్ పూర్తిగా జరిగి..అందులో విజయం సాధిస్తే..ఆ ఆనందం వేరే లెవల్ అని చెప్పాడు. కానీ వర్షం తమ ఆనందాన్ని లాగేసుకుందన్నాడు. అయితే పిచ్పై న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. అందువల్లే తాము 60 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయామని చెప్పాడు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా...10 -15 పరుగులు అదనంగా చేయాలని అనుకున్నట్లు పాండ్యా చెప్పుకొచ్చాడు.
నా బుడ్డోడితో ఆడుకుంటా...
న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20 ఆటగాళ్లను పరీక్షించేందుకు ఉపయోగపడిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే వెదర్ అనుకూలించలేదన్నాడు. మొత్తానికి టీ20 సిరీస్ ముగిసిందని..సిరీస్ విజయం ఆనందాన్నిచ్చని చెప్పాడు. టీ20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత్ వెళ్లిపోతానన్నాడు. తన కోసం కొడుకు ఎదురు చూస్తున్నాడని..వాడితో ఆడుకుంటానని పాండ్యా చెప్పుకొచ్చాడు.
వన్డేలకు కెప్టెన్గా ధావన్
న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నెల 25 నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్ కు కెప్టెన్గా ధావన్ వ్యవహరిస్తాడు. అయితే టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వచ్చిన పాండ్యా..వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్లో అడుగుపెట్టాడు.