హార్దిక్ పాండ్యా..రూ.5 కోట్ల విలువైన రెండు వాచ్‌లు సీజ్!

హార్దిక్ పాండ్యా..రూ.5 కోట్ల విలువైన రెండు వాచ్‌లు సీజ్!

ముంబై: టీమిండియా హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. పాండ్యా ధరించే అత్యంత విలువైన రెండు వాచ్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీ20 ప్రపంచ కప్ టోర్నీ భారత జట్టు నిష్క్రమించిన అనంతరం యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న క్రమంలో.. ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వాచ్‌ల విలువ సుమారు రూ.5 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. నవంబరు 14వ తేదీ రాత్రి ఈ ఘటన వెలుగుజూసింది. ఆ వాచీలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు పాండ్యా చూపకపోవడంతో ఈ ఆల్‌రౌండర్‌ను ఆపిన కస్టమ్స్ ఆఫీసర్లు.. గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. హార్దిక్‌ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్‌ కలెక్షన్‌ ఉంది. వీటిలో పటేక్‌ ఫిలిఫ్‌ నాటిలస్‌ ప్లాటినమ్‌ 5711 ప్రముఖమైంది. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం.. ఈ వాచ్‌‌ను మొత్తం ప్లాటినమ్‌తో తయారు చేశారు. 32 బాగెట్‌ కట్‌ ఎమరాల్డ్స్‌ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్‌ బ్రాస్‌లెట్‌ కూడా ఉంటుంది.