ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి మీద కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సమీక్షించారు హరీశ్ రావు ... ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు కోడికత్తి అని హేళన చేస్తున్నారని విమర్శించారు. నిందితుడి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారని..త్వరలోనే నిజానిజాలు బయటపడుతాయని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రభాకర్ రెడ్డికి 3 గంటల పాటు సర్జరీ చేశారని.. చిన్నపేగుకు తీవ్ర గాయమైందని హరీశ్ తెలిపారు.
Also Read : రాజకీయ కుట్ర అయితే ఆ పార్టీకే నష్టం జరుగుతుంది: జీవన్ రెడ్డి
తెలంగాణలో హత్యా రాజకీయాలకు చోటులేదన్నారు మంత్రి హరీశ్ రావు. గతంలో బీహార్ , రాయలసీమలలో ఫ్యాక్షన్ కత్తిపోట్లు చూశాం కానీ. ఇప్పటి వరకు ఇలాంటి దాడులు తెలంగాణలో చూడలేదన్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుందన్నారు. ఈ దాడిలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల భద్రత పెంచాలని కోరారు.