ఉద్యమ స్ఫూర్తితో పని చేద్దాం : ఎమ్మెల్యే హరీశ్ ​రావు

ఉద్యమ స్ఫూర్తితో పని చేద్దాం : ఎమ్మెల్యే హరీశ్ ​రావు

మెహిదీపట్నం, వెలుగు: తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో కలిసి పని చేద్దామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం లంగర్ హౌస్ లోని ఓ హోటల్లో  పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు.  హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు 6 వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లను పలు దశల్లో రెగ్యులరైజ్ చేయగా.. వారు కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి ఆయనను సన్మానించారు.

అనంతరం హరీశ్​ రావు మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు లెక్చరర్ల జీతం తక్కువగా ఉండేదని, ప్రత్యేక కృషితో శాలరీ పెంచేలా చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేశారు. యూనియన్ పీఎస్ ఉమాశంకర్, ప్రధాన కార్యదర్శి  అస్మతుల్లా ఖాన్, ప్రెసిడెంట్ అరుణ్ ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.