చంద్రబాబును ఎదురించే దమ్ము లేదా..? హరీష్ రావు

చంద్రబాబును ఎదురించే దమ్ము లేదా..? హరీష్ రావు

హైదరాబాద్:  రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలలో సీఎం రేవంత్ రెడ్డి మించిపోతుండని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడిన అబద్దామేనని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దాసోహం అయ్యారని ఆరోపించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం క్రాఫ్ హాలీడే ప్రకటించి 65 టీఎంసీల నీటిని ఉపయోగించేకుండా చేసిందన్నారు. గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబును ఎదిరించే దమ్ము లేదా అని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు్కు  వెళ్లుతుందని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్ట్ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకోవాలని సూచించారు. 

కాళేశ్వరం కుప్పకూలిందని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి గంగమల్లకు నీళ్లు ఎక్కడి నుండి తెస్తారని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఒక్క డీఏ ఇచ్చేందుకు మూడు కమీటీలు వేసి దీనిపై క్యాబినెట్‎లో ఐదు గంటల చర్చించారని అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలువునా ముంచుతుందని.. ఉద్యోగులకు తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.