
దుబ్బాక మండల కేంద్రంలో 1,804 మందికి నూతన ఆసరా పెన్షన్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత లబ్దిదారులకు నెలకు రూ. 2016 పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 50లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, ఇంకా ఎవరైనా లబ్దిదారులు ఉంటే వారికి కూడా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొత్తగా పెన్షన్ అందుకున్న లబ్ధిదారులకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
మరో 15 రోజుల్లో దుబ్బాకలోని 100 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు, తాగు నీటి గోస పోయిందని, గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్తే మహిళలు బిందెలతో అడ్డుకునేవారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు.