హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్ అమలు తీరుపై సీఎం రేవంత్కి మాజీ మంత్రి హరీశ్ రావు మంగళవారం లెటర్ రాశారు. 200 యూనిట్స్ దాటితే మొత్తం బిల్లు వసూలు చేయడంతో చాలా మంది పేదలు నష్టపోతున్నా రని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రేషన్ కార్డు ఉన్న అంద రికీ స్కీమ్ వర్తింపజేయాలని కోరారు.
రాష్ట్రంలో 90 లక్షల మందికి పైగా తెల్లరేషన్ కార్డులుంటే, ప్రభు త్వం కేవలం 30 లక్షల మందికే పథకాన్ని అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్లో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే అమలు చేయాలని నిర్ణయించారని వివరించారు.