200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు వసూలు కరెక్ట్ కాదు: హరీశ్ రావు

200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు వసూలు కరెక్ట్ కాదు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్​ అమలు తీరుపై సీఎం రేవంత్​కి మాజీ మంత్రి హరీశ్​ రావు  మంగళవారం లెటర్​ రాశారు. 200 యూనిట్స్ దాటితే మొత్తం బిల్లు వసూలు చేయడంతో చాలా మంది పేదలు నష్టపోతున్నా రని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రేషన్ కార్డు ఉన్న అంద రికీ స్కీమ్​ వర్తింపజేయాలని కోరారు.

 రాష్ట్రంలో 90 లక్షల మందికి పైగా తెల్లరేషన్ కార్డులుంటే, ప్రభు త్వం కేవలం 30 లక్షల మందికే పథకాన్ని అమలు చేస్తుందన్నారు.  హైదరాబాద్​లో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే అమలు చేయాలని నిర్ణయించారని వివరించారు.