- 13 ఏండ్లవుతున్నా సందర్భంగా ట్వీట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో మిలియన్మార్చ్ కీలక ఘట్టమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం మిలియన్ మార్చ్పై ఆయన ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవం మిలియన్ మార్చ్. నిర్బంధాలు, అరెస్టులు, దిగ్బంధాలను ఎదుర్కొంటూ జలమార్గం గుండా ప్రజలు వచ్చి మిలియన్మార్చ్లో పాల్గొని నేటికి 13 ఏండ్లయినా ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. స్వరాష్ట్ర సాధన కోసం ఆ నాడు ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి వందనం. అమరులకు జోహార్’’ అని హరీశ్ పేర్కొన్నారు.