తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన హరీష్ రావు

తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన హరీష్ రావు

హైదరాబాద్‌:  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. జనవరి 16వ తేదీ మంగళవారం సాయంత్రం తమ్మినేనికి గుండెపోటుతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు వెంటనే.. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి తమ్మినేని వీరభద్రంను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని హరీష్ అడిగి తెలుసుకున్నారు.

ఈరోజు ఖమ్మం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేని వీరభద్రం గుండెపోటుతో అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటినా కుటుంబం సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం  అక్కడి నుంచి హైదరబాద్ లోని AIG ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.