గోడౌన్ లో అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి

గోడౌన్ లో అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి

హర్యానాలో  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యమునానగర్ లోని ఓ స్క్రాప్ గోడౌన్ లో గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్క్రాప్ గోడౌన్ లో నాలుగు ఫ్యామిలీలు ఉంటున్నాయని.. వారిలో 17 మందిని మంటల నుంచి కాపాడమని ఫైర్ సిబ్బంది తెలిపారు. చనిపోయిన వారిని నియాముద్దీన్ కుటుంబసభ్యులుగా గుర్తించారు. ఈ ఘటనలో నియాముద్దీన్ తో పాటు ఆయన కుమార్తె ఫిజా (12), కొడుకులు చాంద్ (8), రెహాన్ (3)లుగా గుర్తించారు. నియాముద్దీన్ భార్య నసీమాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న సివిల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.