V6 News

సిద్దిపేట జిల్లాలో రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో హెచ్సీసీబీ ప్లాంటు

సిద్దిపేట జిల్లాలో రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో హెచ్సీసీబీ ప్లాంటు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హిందుస్థాన్  కోకాకోలా బెవరేజెస్ (హెచ్​సీసీబీ) తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అవిన్యా ప్లాంటులో కిన్లే వాటర్ ప్రొడక్షన్ లైన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన విభాగం నిమిషానికి 1,350 సీసాల కిన్లే నీటిని ఉత్పత్తి చేయగలదు. అత్యాధునిక ఆటోమేషన్ సాంకేతికతతో పనిచేసే ఈ ప్లాంటులో 90 శాతం వరకు నీటిని రీసైక్లింగ్ చేసే సదుపాయం ఉంది.  దీని ద్వారా వెయ్యి మందికి పైగా ఉపాధి లభిస్తోందని కంపెనీ తెలిపింది.