తాగుడు మానట్లేదని తండ్రినే చంపేసిండు

తాగుడు మానట్లేదని తండ్రినే చంపేసిండు

చేర్యాల, వెలుగు: తాగుడుకు బానిసైన తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని జాలపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ భీంరెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జాలపల్లి గ్రామానికి చెందిన మెతుకు సిద్దిరాంరెడ్డి (44) తాగుడుకు బానిసయ్యాడు . మందు కోసండబ్బులు ఇవ్వాలని నిత్యం కుటుంబసభ్యులను వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కొడుకు సిద్దిరామాంజనేయరెడ్డిని డబ్బులు ఇవ్వాలని తండ్రి అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. విసుగుచెందిన కొడుకు తాడుతో ఉరివేసి తండ్రిని హత్య చేశాడు.

కరెంట్ షాక్ తో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అనుమానంతో రామాంజ నేయరెడ్డిని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితున్ని అదుపులోకి తీసుకుని .. శవ పంచనామా చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుని మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం