ఆ రాత్రి ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడు: అశ్విన్

ఆ రాత్రి ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడు: అశ్విన్

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషన్‌లోని అన్ని ఫార్మాట్స్‌కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ధోని గురించి ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మాట్లాడాడు. యూట్యూబ్‌లో రెమినిసీన్‌ విత్ అశ్విన్‌ అనే చానెల్ ద్వారా అశ్విన్‌ మాహీ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ధోని టెస్టు రిటైర్మెంట్ తీసుకున్నప్పటి విషయాలను ప్రస్తావించాడు. 2014లో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ సమయంలో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్న ధోని ప్రకటించాడు. ఆ సిరీస్‌లో కీలకమైన మూడో టెస్టులో తప్పక నెగ్గాల్సిన ఇండియా ఓడిపోయింది. అప్పటి విషయాలను అశ్విన్ పంచుకున్నాడు.

‘అతడు (ధోని) టెస్టు క్రికెట్ నుంచి 2014లో వైదొలగడం నాకు గుర్తుంది. మెల్‌బోర్న్‌లో అతడితో కలసి బ్యాటించ్ చేస్తూ మ్యాచ్‌ను కాపాడటానికి యత్నించా. కానీ మేం ఓడిపోగానే అతడు వికెట్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ నేను ముగిస్తున్నా అని చెప్పాడు. ఆ రోజు రాత్రి అతడికి చాలా ఉద్విగ్నభరిత క్షణాలని చెప్పొచ్చు. ఇషాంత్ శర్మ, సురేష్ రైనాతోపాటు నేను రూమ్‌లో సాయంత్రం ఒకేచోట కూర్చున్నాం. ఆ రాత్రి మొత్తం అతడు (ధోని) అదే టీషర్ట్‌ వేసుకొని ఉన్నాడు. అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా’ అని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.