
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రకాశ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రివాల్వర్ తో కాల్చుకొని ప్రకాశ్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే నిజామాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రకాశ్ రెడ్డి మృతిచెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఆత్మాహత్యాయత్నానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఎస్ఐ తన రివాల్వర్ ను స్టేషన్ లోనే ఉంచి ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం. ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు పోలీస్ కమిషనర్ కార్తికేయ.