పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం : డి.సుధాకరరావు

పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం : డి.సుధాకరరావు
  • ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛత పక్వాడ శ్రమదానం

బషీర్ బాగ్, వెలుగు :  పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ డి.సుధాకరరావు పేర్కొన్నారు.  కోఠి ఇసామియా బజార్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత పక్వాడ శ్రమదాన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇన్ కమ్ టాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సుధాకరరావు, అదనపు కమిషనర్ హర్షిత్ చౌహాన్ హాజరయ్యారు.

ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో పరిసరాల పరిశుభ్రతపై.. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సిటీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు మరుగుదొడ్లు కొత్తగా నిర్మాణం చేసినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.