కేరళలో వర్షాలు నదిలో ఆటో కొట్టుకుపోయి తల్లీ, కొడుకులు మృతి

కేరళలో వర్షాలు నదిలో ఆటో కొట్టుకుపోయి తల్లీ, కొడుకులు మృతి

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా అలప్పుజ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న సమయంలో నలుగురు కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి అచ్చంకోవిల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు గల్లంతయ్యాడు. ఆ మహిళ భర్త, కుమార్తె, ఆటో డ్రైవర్‌‌ను స్థానికులు రక్షించారు. 

సోమవారం ఉదయం స్కూబా టీమ్ గాలింపు చేపట్టగా బాలుడి డెడ్ బాడీ దొరికింది. పథనంతిట్ట జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పంబా నది నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు మూజియార్ డ్యామ్‌‌లోని ఒక షట్టర్‌‌ను తెరిచారు. కాగా, రాబోయే 24 గంటల్లో పథనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్  ప్రకటించింది.