
న్యూఢిల్లీ: కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్కాంత్ ముంజాల్ సహా ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జరపడంతో హీరో మోటోకార్ప్ షేర్లు మంగళవారం సెషన్లో 3 శాతం పతనమయ్యాయి. ఈ టూ వీలర్ కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ. 3,103 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో హీరో మోటోకార్ప్ షేరు 5.34 శాతం మేర పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ వాల్యూ రూ. 2,007 కోట్లు తగ్గి రూ. 62,011 కోట్లకు చేరింది.
పవన్కాంత్ ముంజాల్ ఇల్లు, ఆఫీసులలో ఈడీ సోదాలు జరిపింది. మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు చేపట్టారు. పీఎంఎల్ఏ కింద కేసు రిజిస్టర్ చేశాక దాడులు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ అధికారులు తమ రెండు ఆఫీసులను, పవన్ముంజాల్ఇంటినీ సోదా చేసినట్లు హీరో మోటోకార్ప్ ధృవీకరించింది. ఈడీ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు పేర్కొంది. ఇండియా సహా 40 దేశాలలో హీరో మోటోకార్ప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.