మహేశ్ బాబుతో సినిమాపై తరుణ్ క్లారిటీ

మహేశ్ బాబుతో సినిమాపై తరుణ్ క్లారిటీ

హీరో మహేశ్‌ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో సందడి చేసిన తరుణ్ కొంత కాలంగా సినిమాలకు గాప్ తీసుకున్నారు. అయితే ఎలా మొదలయిందో? ఎందుకు మొదలయిందో తెలియదు కానీ తరుణ్‌, మహేశ్‌ బాబు-, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు మొదలయ్యాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే ఓ అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఈ సినిమాలో ఒకప్పటి సక్సెస్ ఫుల్ హీరో తరుణ్ కూడా నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నటుడు తరుణ్ స్పష్టత ఇచ్చారు. అలాంటి వార్తేమైనా ఉంటే తానే ఫ్యాన్స్ తో చెప్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నట్టు తెలుస్తోంది.