జడేజా రాణించడం ఇండియాకు కీలకం

జడేజా రాణించడం ఇండియాకు కీలకం

రాబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో టీమిండియా గెలవాలంటే రవీంద్ర జడేజా రాణించడం కీలకమని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. భారత జట్టులో జడేజాయే ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పాడు. అతడు బౌలింగ్, బ్యాటింగ్ తోపాటు ఫీల్డింగ్ లోనూ అదరగొట్టడం భారత్ కు లాభిస్తుందన్నాడు. 

'జడేజా ఐపీఎల్ లో సూపర్బ్ గా ఆడాడు. ఇండియా ఒకే స్పిన్నర్ ను ఆడించాలనుకుంటే అశ్విన్ ప్లేస్ లో జడేజాను తీసుకోవాలి. ఓ లెఫ్టార్మ్ బౌలర్ గా డిఫెన్సివ్ బౌలింగ్ వేయగలగడం అతడికి అనుకూల అంశం' అని పనేసర్ పేర్కొన్నాడు.