ఇంగ్లీష్ మీడియంపై ఏపీ జీవోలను రద్దు చేసిన హైకోర్టు

ఇంగ్లీష్ మీడియంపై ఏపీ జీవోలను రద్దు చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లోని  వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, జీవో 85లను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు…ఇవాళ(బుదవారం) తీర్పునిచ్చింది.

ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే తీసుకుంటారని కోర్టుకు విన్నవించారు లాయర్ ఇంద్రనీల్. ఇంగ్లీష్ మీడియంతో బ్యాక్ లాగ్లు పెరిగిపోతాయని తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ  తుది తీర్పును వెలువరిస్తూ… 81, 85 జీవోలను కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.