ఫాం హౌస్ కేసు : సిట్ నోటీసులపై స్టే పొడగించిన హైకోర్టు

ఫాం హౌస్ కేసు : సిట్ నోటీసులపై స్టే పొడగించిన హైకోర్టు

ఫాం హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, అడ్వొకేట్ బి. శ్రీనివాస్ కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన సీఆర్పీసీ 41 ఏ నోటీసులపై స్టే 30వ తేదీ వరకు పొడగించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. 

ఫాం హౌస్ కోసులో బీఎల్ సంతోష్, జగ్గు స్వామి, తుషార్, అడ్వొకేట్ బి. శ్రీనివాస్ ను విచారించాల్సిన అవసరం ఉందంటూ సిట్ వారికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు దాఖలు చేసింది. అయితే వాటిని రద్దు చేయాలంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం నవంబర్ 25న బీఎల్ సంతోష్ కు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. ఆ తర్వాత జగ్గు స్వామి, శ్రీనివాస్ లకు ఊరటనిచ్చింది. లుకౌట్ నోటీసులను కూడా నిలిపేసింది. డిసెంబర్ 14న సిట్ నోటీసులపై విధించిన స్టేను ఈ నెల 22వ తేదీ వరకు పొడగించింది. తాజాగా పిటిషన్ పై మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం 30వ తేదీ వరకు స్టే పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.