ఓల్డేజ్ హోమ్స్ లో సౌలతులెట్లున్నయ్

ఓల్డేజ్ హోమ్స్ లో సౌలతులెట్లున్నయ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఓల్డేజ్‌ హోమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌలతులు పరిశీలించి, రిపోర్ట్ ఇవ్వాలని అమికస్ క్యూరీ లాయర్ వసుధా నాగరాజును హైకోర్టు బుధవారం ఆదేశించింది. జూన్10 నాటికి ఫుల్ డీటెయిల్స్ అందజేయాలని చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డితో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఓల్డేజ్ హోమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌలతులు సరిగ్గా లేవని, అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని స్టేట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసిన లేఖను పిల్ గా స్వీకరించి హైకోర్టు విచారించింది.