కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్, హరీష్ లకు నో పర్మిషన్

కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత..   కేటీఆర్, హరీష్ లకు నో పర్మిషన్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో  ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మహిళలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్ట్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటి దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి.

లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన తనను అరెస్ట్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉందని మరోసారి అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ.. కాసేపట్లో ఇంట్లో నుంచి బయటికి తీసుకురానున్నారు. ఆమెను నేరుగా ఢిల్లీకి తరలిస్తారని తెలుస్తోంది.

మరోవైపు కవితను ఈడీ అధికారలు అదుపులోకి తీసుకోవడంతో  ఆమె ఇంటి వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు చేరుకున్నారు. కానీ వారిని  సీఆర్పీఎఫ్ జవాన్లు లోపలికి అనుమతించలేదు. దీంతో బయటే వారు ఉన్నారు.