ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ కీలక నిర్ణయం తీసకున్నారు. ఒకే ఆడపిల్ల ఉన్న పేరెంట్స్ కు ఇన్సెంటివ్ కింద రూ. 35 వేలు ఇస్తుండగా.. ఇకపై ఆ మొత్తాన్ని రూ. 2లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటిస్తే రూ. 2లక్షలు..ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటిస్తే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. హిమాచల్ లో లింగ నిష్పత్తి 1000: 950 గా ఉంది. దేశంలోనే అత్యుత్తమ స్థానంలో మూడో స్థానంలో ఉంది.