బీజేపీలోకి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్

బీజేపీలోకి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ బుధవారం బీజేపీ లో చేరారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్-కు నాయకత్వం, దిశ, విజన్ లేవని హర్ష్ మహాజన్ ధ్వజమెత్తారు. ఢిల్లీలోని మా–బేటా తరహాలోనే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్- పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారని.. వారి కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఎమ్మెల్యే పదవి చేపట్టారని తెలిపారు. వీరభద్ర సింగ్ చనిపోయాక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనమైందని హర్ష్ మహాజన్ వివరించారు.