హిమాచల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న 105ఏళ్ల వృద్ధురాలు

హిమాచల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న 105ఏళ్ల వృద్ధురాలు

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని చురాలో 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని లధన్ పోలింగ్ స్టేషన్ లో 105 ఏళ్ల వయసున్న నరో దేవి ఓటు వేశారు. 80ఏళ్ల పైబడిన ఓటర్లకు తమ ఇళ్ల వద్దే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కానీ ఆ సదుపాయాన్ని నరో దేవి మాత్రం స్వీకరించలేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఓటు వేసేందుకు సుముఖత చూపింది.

ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఉ.11గంటల వరకు 17.98శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. కాగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఇప్పటికే సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.