Job News : హిందుస్తాన్ షిఫ్ యార్డులో మేనేజర్ ఉద్యోగాలు.. డిగ్రీ, బీటెక్, పీజీ డిప్లొమా ఉంటే చాలు..!

Job News : హిందుస్తాన్ షిఫ్ యార్డులో మేనేజర్ ఉద్యోగాలు.. డిగ్రీ, బీటెక్, పీజీ డిప్లొమా ఉంటే చాలు..!

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి విశాఖపట్నం హిందుస్థాన్ షిప్​యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 3.

పోస్టుల సంఖ్య: 26

పోస్టులు: మేనేజర్ 22, డిప్యూటీ మేనేజర్ 01, సీనియర్ మేనేజర్ 01, డిప్యూటీ జనరల్ మేనేజర్ 01, అడిషనల్ జనరల్ మేనేజర్ 01.

డిపార్ట్​మెంట్స్: ఐటీ అండ్ ఈఆర్ పీ, ఫైనాన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, లీగల్, టెక్నికల్, సబ్​మెరైన్, కంపెనీ, సెక్రటరీ, హ్యూమన్ రిసోర్స్.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్​బీ, పీజీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు ఐసీఏఐలో సభ్యుడై ఉండాలి. 

వయోపరిమితి: మేనేజర్ 40 ఏండ్లు, డిప్యూటీ మేనేజర్ 35 ఏండ్లు, సీనియర్ మేనేజర్ 42 ఏండ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ 45 ఏండ్లు, అడిషనల్ జనరల్ మేనేజర్ 48 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 3.

లాస్ట్ డేట్: జులై 3

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్​బీడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.300.

సెలెక్షన్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.