హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ప్రభుత్వ భూమి వేలానికి HMDA నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న 8ఎకరాల 24 గుంటల ప్రభుత్వ భూమిని ఎకరాకు 99 కోట్ల రూపాయల ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనేవారు ముందస్తుగా ఎకరానికి 5కోట్ల రూపాయలు ధరావత్తు(ఈ ఎండీ) చెల్లించాలని కోరింది. జూన్ 19న ప్రీ బిడ్ మీటింగ్, జూలై 2న ఈ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గల పెట్టుబడి దారులు, ప్రతినిధులు వేలం పాల్గొనవచ్చని తెలిపింది.
►ALSO READ | మగపిల్లల మోజు ఇంకా వీడలేదు.. మారని సమాజ మనస్తత్వంపై సుప్రీంకోర్టు ఆందోళన
