మోకిల ప్లాట్లు కొని డబ్బులు కట్టని ఓనర్.. హెచ్ఎండీఏ నోటీసులు

మోకిల ప్లాట్లు కొని డబ్బులు కట్టని ఓనర్.. హెచ్ఎండీఏ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: మోకిల ఫేజ్ 1వేలంలో ప్లాట్లు కొని ఇంకా డబ్బులు కట్టని కంపెనీలపై హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఫేజ్ 1లోని 50 ప్లాట్లల్లో 241, 242, 263, 273, 282, 283, 284, 312, 313, 323 నంబర్ ప్లాట్లను కొన్న కంపెనీలకు క్యాన్సిలేషన్ లెటర్లు జారీ చేసింది. అంతేగాకుండా..ఈ కంపెనీలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ నిర్వహించే వేలంలో  పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్​లో పెట్టింది. ఇచ్చిన గడువులోగా మొత్తం ప్లాట్ అమౌంట్​లో 25 శాతం చెల్లించనందునే ఈ చర్యలు చేపట్టినట్లు సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

రూల్స్ ప్రకారం ఇప్పటికే కట్టిన అమౌంట్​ను కూడా జప్తు చేస్తున్నట్లు తెలిపింది. మిగతా కంపెనీలు, వ్యక్తులు కూడా ఫస్ట్ ఇన్​స్టాల్​మెంట్​ అమౌంట్​ను వెంటనే  కట్టాలని, లేకపోతే వారిని కూడా బ్లాక్ లిస్ట్​లో పెట్టి భవిష్యత్తులో  వేలంలో పాల్గొనకుండా చేస్తామని హెచ్ఎండీఏ హెచ్చరించింది.