పైగా ప్యాలెస్​కు హెచ్ఎండీఏ షిప్ట్

పైగా ప్యాలెస్​కు హెచ్ఎండీఏ షిప్ట్

హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ ఆఫీసును బేగంపేటలోని పైగా ప్యాలెస్ కు షిప్ట్ చేయాలని మున్సిపల్ అర్బన్ డెవలప్ మెంట్ (ఎంఏయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీఏ హెడ్ ఆఫీస్ అమీర్ పేటలో ఉండగా.. ఓఆర్ ఆర్, గ్రోత్ కారిడార్ ఆఫీస్ నానక్ రామ్ గూడలో, బుద్దిపూర్ణిమ ఆఫీస్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. దీని వల్ల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఉత్తర్వుల్లో తెలిపారు. అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంతో  షిప్ట్ చేయనున్నట్లు దానకిషోర్ చెప్పారు. 

షిఫ్టింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ ను ఆదేశించారు. కాగా..హెచ్ఎండీఏలోని‌‌ మెట్రో పాలిటన్ ట్రాన్స్‌‌పోర్ట్ అథారిటీ డైరక్టర్ గా జీవన్ బాబును నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం ఢిల్లీ డెవలప్‌‌మెంట్ అథారిటి డైరెక్టర్ గా ఉన్న ఆయననుఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ పద్ధతిలో ప్రభుత్వం తీసుకొచ్చింది.