
- గ్రేటర్ సిటీలో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం
- కొత్త పాలసీ పర్మిషన్ కోసం బల్దియా వెయిటింగ్
- గతంలో మాదిరిగా కాకుండా కొన్ని మార్పులు
- తక్కువ ఎత్తులో జంక్షన్లలో, మెయిన్ రోడ్ల వెంట ఏర్పాటుకు వెసులుబాటు
- బల్దియాకు రానున్న ఆదాయం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో మళ్లీ హోర్డింగ్ లకు కనిపించనున్నాయి. 2020 సంవత్సరం వరకు వీటి ఏర్పాటుకు అనుమతులు ఉండేది. వాటి ద్వారా బల్దియాకు ప్రతిఏటా రూ.36 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే పలు ప్రమాదాలు చోటుచేసుకోగా.. అప్పట్లో హోర్డింగ్స్ని బ్యాన్ చేస్తూ గత ప్రభుత్వం జీవో 68ను జారీ చేసింది. అయితే.. ప్రకారం15 ఫీట్ల ఎత్తులో మాత్రమే హోర్డింగ్స్ పెట్టుకునే వీలుండేది.
కాగా.. ఉపాధి కోల్పోతున్నామని ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ ఏజెన్సీలు హైకోర్టుకు వెళ్లాయి. నాలుగేండ్ల తర్వాత ఇటీవల కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని, జీవో 68 పాలసీ కరెక్టే అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్పు చెప్పింది. దీంతో సిటీలో దాదాపు 2,600 హోర్డింగ్స్ ఉండగా, ఇందులో వెయ్యి వరకు ఏజెన్సీలు తమ ఆ తర్వాత తమ హోర్డింగ్స్ ని తీసేసుకోగా.. మరో 50శాతం బల్దియా తొలగించింది.
అక్కడక్కడ మరో 200 వరకు ఉండొచ్చు. ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోర్డింగ్స్ తో వచ్చే ఆదాయం ఎందుకు వదులుకోవడం అని ఆలోచన చేసింది. దీంతో గతంలో మాదిరిగా కాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకునే విధంగా హోర్డింగ్స్ కు మళ్లీ కొత్త పాలసీని రూపొందించి బల్దియా అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాగానే కొత్త పాలసీ ఆధారంగా తిరిగి హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది.
కొత్త పాలసీ ఉంటుందిలా..
గ్రేటర్ సిటీలో కొత్త హోర్డింగ్ పాలసీకి బల్దియా ప్రపోజల్స్ పై సర్కార్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. అందులో హోర్డింగ్స్ ఎత్తు 80 ఫీట్ల వరకు, వీటిని కేవలం100 ఫీట్ల రోడ్లపైన పెట్టుకునే చాన్స్ ఉంది. హోర్డింగ్ ల మధ్య 250 మీటర్ల గ్యాప్ మస్ట్ గా ఉండాలి. జంక్షన్ నుంచి కూడా100 ఫీట్ల గ్యాప్ ఇచ్చి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఎల్ఈడీ స్క్రీన్ లకు పర్మిషన్లు కూడా లభిస్తాయి. కొత్త పాలసీ ప్రకారం నార్మల్ హోర్డింగ్ అయితే 4,500 స్క్వైర్ ఫీట్లలో ఉండనుంది. ఎల్ఈడీ అయితే రివైజ్ చేసి రేటు ఫిక్స్ చేసే చాన్స్ ఉంది. బిల్లింగ్, రూఫ్ టాప్, రోడ్డుపై ఏర్పాటుకు వీలుండగా అందుకు అన్ని క్లియరెన్స్ లు తీసుకున్నాకే పర్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఏడాదికి వంద కోట్ల ఆదాయం
ప్రస్తుతం ప్రభుత్వానికి పంపిన కొత్త పాలసీ ప్రపోజల్స్ ప్రకారం హోర్డింగ్స్ ద్వారా బల్దియాకు ఏడాదికి దాదాపు రూ.100 కోట్ల ఆదాయం రానుంది. 2020లో హోర్డింగ్స్ బ్యాన్ చేసిన తర్వాత కేవలం బస్ షెల్టర్లు, ట్రాఫిక్ తదితర అడ్వటైజ్ మెంట్ల నుంచి రూ.18 కోట్ల ఇన్ కమ్ మాత్రమే వస్తుంది. మెట్రో రైల్ కు చెందిన ఎల్అండ్ టీ సంస్థ బల్దియాకు రూ.40 కోట్ల బకాయిలు కూడా పడింది. వీటిని కూడా వసూలు చేసే పనిలో బల్దియా అధికారులు ఉన్నారు. కొత్త పాలసీ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి టెండర్లు వేసి దక్కించుకున్నవారికి బాధ్యతలు అప్పగించనుంది.