సమీక్ష తర్వాతే లాక్‌ డౌన్‌పై కేసీఆర్ నిర్ణయం

సమీక్ష తర్వాతే లాక్‌ డౌన్‌పై కేసీఆర్ నిర్ణయం

సమీక్ష తర్వాత లాక్‌ డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులో చర్చించామన్నారు. లాక్ డౌన్‌ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. తర్వలో రాష్ట్రంలోని పరిస్ధితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారన్నారు. లాక్‌ డౌన్‌ పెట్టడం సీఎంకు ఇష్టం లేదన్నారు.లాక్‌డౌన్‌ వల్ల ఆర్ధిక ఇబ్బందులు చాలా వస్తాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.  కరోనా కేసులను ఆసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందన్నారు. ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజక్షన్ వరకూ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుందన్నారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు.