హైదరాబాద్లో హోమ్ ఓటింగ్ షురూ

హైదరాబాద్లో హోమ్ ఓటింగ్ షురూ

హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్​లోక్​సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్​అసెంబ్లీ స్థానానికి సంబంధించి శుక్రవారం ‘ఓట్​ఫ్రమ్​హోమ్’ మొదలైంది. ఇప్పటికే ఓటుకు అప్లయ్​చేసుకున్న 85 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి ఎన్నికల సిబ్బంది ఓటు వేయించారు. శుక్రవారం హైదారాబాద్ లోక్​సభ స్థానం పరిధిలో 121 మందికి గాను 112 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఓట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే శుక్రవారం మొదలైన పోస్టల్​బ్యాలెట్​ఓటింగ్​లో 852 మంది అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.