భోలక్ పూర్ లో హోటల్ యజమాని హత్య

భోలక్ పూర్ లో హోటల్ యజమాని హత్య
  • కత్తితో పొడిచి పరారైన నిందితుడు

ముషీరాబాద్,వెలుగు : ఓవ్యక్తిదారుణ హత్యకు గురైన ఘటన ముషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. చిక్కడపల్లి ఇన్ స్పెక్టర్ సీతయ్య తెలిపిన ప్రకారం.. భోలక్ పూర్ మండిగల్లి వద్ద చాయ్ హోటల్ నిర్వాహకుడు గౌస్ (46) మేడ్చల్ వాసి. ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు. అదే కాలనీకి చెందిన ఫయాజ్ అహ్మద్ పలుసార్లు గౌస్ తో ఘర్షణ పడ్డాడు. గురువారం మధ్యాహ్నం  ఫయాజ్ అహ్మద్ మరోసారి గౌస్ పై కత్తితో దాడి చేసి హత్య చేసి పరారయ్యాడు.  డెడ్ బాడీని  పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడు ఫయాజ్ కోసం గాలింపు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ సీతయ్య తెలిపారు.