ఇంటి అద్దె అడిగాడని.. కత్తితో దాడి

ఇంటి అద్దె అడిగాడని.. కత్తితో దాడి

ఇంటి అద్దె అడగడమే వాళ్ల తప్పయింది. నన్ను అద్దె అడుగుతారా.. అంటూ అతడు రెచ్చిపోయాడు. అద్దె అడిగిన వ్యక్తిపై ఏకంగా కత్తితో  దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

రాజు అనే వ్యక్తి గత నాలుగు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలేదు. దీంతో ఇంటి యజమాని తరఫున అదే కాలనీకి చెందిన సాయిరాం అనే వ్యక్తి వచ్చి రాజును కిరాయి అడిగాడు. వెంటనే ఇంటి కిరాయి డబ్బులు ఇవ్వమన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన రాజు.. సాయిరాంపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన సాయిరాంను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.