ఇంట్లోంచి బయటకు వెళ్లిన గృహిణి మిస్సింగ్

ఇంట్లోంచి బయటకు వెళ్లిన గృహిణి మిస్సింగ్

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో నివాసముంటున్న ఓ గృహిణి అదృశ్యం అయింది. ఒరిస్సాకు చెందిన శంక హెంబ్రంబ్, పులోమని ముర్మ్ (21) దంపతులు 5 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. వీరు దూలపల్లిలో కిరాయికి ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. పులోమని బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కంగారుపడిన భర్త చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. దాంతో హెంబ్రంబ్ పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి.. తన భార్య కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.