- కూరల్లో కారం ఎక్కువైతే అందులో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపాలి.
- బాగా పులిసిన పెరుగులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. అందులో వెండి, ఇత్తడి వస్తువులు వేసి ఒక గంటసేపు ఉంచి నీళ్లతో కడిగితే మెరుస్తాయి.
- పావుగంటపాటు నీళ్లల్లో నానబెట్టిన ఎండుకొబ్బరిని గ్రైండ్ చేస్తే... పచ్చికొబ్బరిలా వాడుకోవచ్చు.
- కుంకుమ పురుగు పట్టకుండా ఉండాలంటే... అందులో కర్పూరం వేయాలి.