వర్షం వల్ల ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి...?

వర్షం వల్ల ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి...?

హోరా హోరీగా సాగిన టీ20 వరల్డ్ కప్ 2022 చివరి అంకానికి చేరుకుంది. సూపర్  12 మ్యాచులు ముగిసిన నేపథ్యంలో బుధవారం తొలి సెమీస్, గురువారం రెండో సెమీస్ జరగనుంది. అదివారం ఫైనల్తో  టీ20 వరల్డ్ కప్ 2022కు తెరపడనుంది. అయితే సూపర్ 12లో కొన్ని మ్యాచులకు వరుణుడు అటంకం కలిగించాడు. దీంతో కొన్ని మ్యాచులు రద్దయ్యాయి. ఈ సమయంలో రెండు జట్లు చెరో పాయింట్ దక్కించుకున్నాయి. మరి సెమీ ఫైనల్స్తో పాటు..ఫైనల్కు వర్షం అడ్డు తగిలితే పరిస్థితి ఏంటీ...విజేతను ఎలా నిర్ణయిస్తారు..? 

రద్దయితే ఏం చేస్తారంటే..?
టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్స్తో పాటు..ఫైనల్ మ్యాచ్కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. మ్యాచ్ జరిగిన రోజు వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే..తర్వాత రోజున మ్యాచ్ను నిర్వహిస్తారు. తర్వాత రోజు కూడా వర్షం వల్ల ఆట సాధ్యం కాకపోతే..కనీసం ఐదు ఓవర్ల పాటు అయినా మ్యాచ్ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. కనీసం 5 ఓవర్లు కూడా మ్యాచ్ కొనసాగే పరిస్ధితి లేకపోతే మాత్రం..సూపర్ 12లో పాయింట్స్ పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఇక ఫైనల్ మ్యాచుకు కూడా రిజర్వ్ డే ఉంది. ఆ రోజు కూడా వాన వల్ల మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే..కనీసం 10 ఓవర్ల ఆట కొనసాగాలి. ఫైనల్లోనే ఇదే పరిస్థితి తలెత్తి 10 ఓవర్ల ఆట కూడా కొనసాగకపోతే.. రెండు జట్లు టైటిల్ను షేర్ చేసుకుంటాయి. మ్యాచ్ల ప్రారంభానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. 

భారత్ ఫైనల్ చేరడం పక్కా...
న్యూజిలాండ్, పాక్ మధ్య జరిగే తొలి సెమీస్కు వరుణుడు అడ్డుతగిలితే మాత్రం రిజర్వ్ డే రోజున మ్యాచ్ను నిర్వహిస్తారు. ఆ రోజు కూడా మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే..సూపర్ 12లో మెరుగైన స్థితిలో నిలిచిన న్యూజిలాండ్ ఫైనల్ చేరుకుంటుంది. ఇక రెండో సెమీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే..రిజ్వర్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది. ఆ రోజు కూడా మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే..సూపర్ 12లో గ్రూప్ 2లో టాపర్గా నిలిచిన టీమిండియా ఫైనల్ చేరుతుంది. 

వాతావరణ శాఖ ఏం చెబుతోంది...
ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రస్తుతం సెమీ ఫైనల్ మ్యాచులు జరిగే అడిలైడ్, సిడ్నీలో వానలు పడే ఛాన్స్ లేదు. కానీ ఆస్ట్రేలియా వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అయితే ఎంత పెద్ద వాన వచ్చినా గ్రౌండ్ ను ఆటకు సిద్ధం చేసే టెక్నాలజీ ఆస్ట్రేలియా సొంతం. అడిలైడ్, సిడ్నీతో పాటు..మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియాల్లో అత్యున్నత పరికరాలు, టెక్నాలజీ ఉంది. కాబట్టి..వాన వల్ల మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పాలి.