అస్సాంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. కోక్రాఝార్ జిల్లాలోని రిపు రిజర్వ్ ఫారెస్ట్ లో ఆర్మీ, సశస్త్ర సీమాబల్, సీఆర్పీఎఫ్ లతో కలసి పోలీసులు డ్రైవ్ చేపట్టారు. ఆయుధాలున్నాయనే సమాచారంతోనే కూంబింగ్ చేశారు పోలీసులు. రెండు AK 54 రైఫిల్స్, వాటి మ్యాగజీన్లు, ఆరు పైప్ గన్స్, ఏడు పిస్టల్స్, 26 మ్యాగజీన్లు, 108 రౌండ్ల AK సిరీస్ బుల్లెట్లు, ఐదు గ్రనేడ్లు, 50 క్యాట్రిడ్జ్ లు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 7, 10తేదీల్లో బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. దానికి ముందే ఇంతపెద్ద ఎత్తున ఆయుధాలు లభించడంతో కోక్రాఝార్ జిల్లాలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
దేశంలో లక్షా 40 వేలు దాటిన మృతులు
హైదరబాద్ లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం
Kokrajhar: In a joint operation, security forces seized huge cache of arms and ammunition from jungle area of Ripu Reserve Forest under Gossaigaon police station limits, yesterday. #Assam pic.twitter.com/3ZWdyjqmuV
— ANI (@ANI) December 5, 2020