హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై దాడికి యత్నం కేసులో ఎంఐఎం నాయకులు పై కేసు నమోదు చేశారు పోలీసులు. మాధవిలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు మొగల్పురా పోలీసులు. 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించడానికి వెళ్లిన మాధవి లత పై దాడి చేయడానికి యాకత్పుర ఎంఐఎం ఇంచార్జ్ యాసిర్ అర్ఫాత్ ప్రయత్నించారు. మాధవిలత కారులో వెళ్తుండగా వెంట పడి మరి దాడి చేయబోయారు ఎంఐఎం నాయకులు. బీబీ బజార్ లో మాధవి లతను 100 మంది ఎంఐఎం నాయకులు ముట్టడించారని నసీం తన ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు అందచేయనున్నారు పోలీసులు.
