వేరుకాపురం పెట్టిన కొన్ని రోజులకే భార్యాభర్తల ఆత్మహత్య

వేరుకాపురం పెట్టిన కొన్ని రోజులకే భార్యాభర్తల ఆత్మహత్య

సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవల కారణంగా భార్యభర్తల ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన వెంకటేష్, బార్గవి దంపతులు అంబర్ నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరిలో భార్గవి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుండగా.. భర్త వెంకటేష్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఏఈగా పనిచేస్తున్నాడు. వీరికి పెళ్లి జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. వీరి బంధానికి గుర్తుగా వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. అయితే భార్గవికి, అత్తామామలకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దాంతో భార్గవి అత్తామామల నుంచి దూరంగా భర్తతో కలిసి వేరుకాపురం పెట్టింది. తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చినందుకు వెంకటేష్.. భార్గవితో గొడవపడుతూ ఉండేవాడు. అలాంటి గొడవే బుధవారం కూడా జరిగింది. దాంతో మనస్థాపానికి గురైన భార్గవి వాష్ రూంలో వెంటిలేటర్‌కు తాడుతో ఉరివేసుకొని చనిపోయింది. అది చూసిన వెంకటేష్ కూడా బెడ్ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

For More News..

సరస్సులో పడి చనిపోయిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ సిబ్బంది

యాక్సిడెంట్ అయిన వాళ్లను దగ్గరుండి ఆస్పత్రికి పంపిన బండి సంజయ్

ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు.. 10 మంది మృతి