
భార్యను డెలివరీ కోసం దుబాయ్ నుంచి ఇండియాకు పంపించిన ఓ భర్త.. గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. కేరళకు చెందిన నితిన్ చంద్రన్(28) దుబాయ్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య అతిరా గీతా శ్రీధరన్(27) ప్రస్తుతం 8 నెలల గర్భవతి. డెలివరీ కోసం గీతాను మే 7న చంద్రన్ కేరళాకు పంపించాడు. కరోనా వల్ల వివిధ దేశాలలో చిక్కుకున్న వారిని భారత్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ మిషన్ ద్వారా చంద్రన్.. తన భార్య గీతాను ఇండియాకు పంపించాడు. గీతకు జూలైలో డెలివరీ జరగనుంది.
గల్ఫ్ న్యూస్ ప్రకారం.. చంద్రన్ దుబాయ్లోని ఒక నిర్మాణ సంస్థలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వందే భారత్ మిషన్ క్రింద మే 7న తన భార్య గీతాను దుబాయ్ నుండి ఇండియాకు పంపించాడు. అతను మాత్రం ఉద్యోగ పనుల వల్ల అక్కడే ఉండిపోయాడు. సోమవారం రాత్రి నిద్రలో ఉండగా చంద్రన్కు బీపీ పెరిగి గుండెపోటు వచ్చింది. దాంతో చంద్రన్ నిద్రలోనే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారని చంద్రన్ స్నేహితుడు తెలిపాడు.
For More News..