తాగొద్దన్నందుకు భార్యను చంపిన భర్త

తాగొద్దన్నందుకు భార్యను చంపిన భర్త

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో దారుణం జరిగింది. తాగొద్దన్నందుకు భార్యను గొడ్డలితో నరికి చంపాడో భర్త. ఈ ఘటన మండల పరిధిలోని తక్కల్లపల్లి తండాలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రామావత్ శ్రీను ఆటో నడుపుతూ జీవించేవాడు. శ్రీనుకు భార్య లలిత, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేసిన దంపతులు.. మిగతా ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. కాగా.. శ్రీను ప్రతిరోజూ ఆటో నడిపి.. వచ్చిన డబ్బులతో మద్యం తాగేవాడు. ఈ విషయంలో నిత్యం లలిత, శ్రీనులు గొడవపడేవాళ్లు. సోమవారం రాత్రి కూడా మద్యం సేవించిన శ్రీను.. ఇంటికి వచ్చి భార్య లలితతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీను.. నిగ్రహం కోల్పోయి పక్కనున్న గొడ్డలితో లలిత మీద దాడిచేశాడు. ఈ దాడిలో లలిత అక్కడికక్కడే చనిపోయింది. సమాచారమందుకున్న యాచారం పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.