సైబర్ నేరగాళ్ల బారిన ఏఎస్ ఐఆర్టీఏ చలాన్ పేరుతో.. ఏపీకే ఫైల్ పంపి 49 వేలకు టోకరా

సైబర్ నేరగాళ్ల బారిన ఏఎస్ ఐఆర్టీఏ చలాన్ పేరుతో.. ఏపీకే ఫైల్ పంపి 49 వేలకు టోకరా

పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌లో ఏఎస్‌‌ఐగా పనిచేస్తున్న నర్సయ్య సైబర్​నేరగాళ్ల బారిన పడి మోసపోయాడు. ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.49,139 డెబిట్​అయ్యాయి.

ఈ నెల 8న ఫోన్‌‌కు వరుసగా మెసేజ్‌‌లు వచ్చాయి. దీంతో తన అకౌంట్​ను చెక్​చేసుకోగా డబ్బులు కట్ అవుతున్నట్లు గుర్తించి షాక్‌‌కు గురయ్యాడు. తనకు తెలియకుండా లావాదేవీలు జరుగుతుండటంతో వెంటనే సైబర్ హెల్ప్‌‌లైన్ 1930కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.